Watch: గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. కిటికీలోంచి చేతివాటం చూపించిన దొంగ..
వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు గుడిలో శ్లోకాలు చదువుతుండగా ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ శంకర్ నగర్లోని వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్10న ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. దొంగ ఎత్తుకెళ్లిన బంగారు గొలుసు బరువు 30 గ్రాములు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

