Watch: గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. కిటికీలోంచి చేతివాటం చూపించిన దొంగ..
వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు గుడిలో శ్లోకాలు చదువుతుండగా ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ శంకర్ నగర్లోని వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్10న ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. దొంగ ఎత్తుకెళ్లిన బంగారు గొలుసు బరువు 30 గ్రాములు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
