Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. కిటికీలోంచి చేతివాటం చూపించిన దొంగ..

Watch: గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. కిటికీలోంచి చేతివాటం చూపించిన దొంగ..

Jyothi Gadda

|

Updated on: Oct 15, 2024 | 11:48 AM

వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు గుడిలో శ్లోకాలు చదువుతుండగా ఓ దొంగ తన చేతివాటం చూపించాడు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ శంకర్ నగర్‌లోని వినాయక గుడిలో కొంతమంది మహిళలు కూర్చొని శ్లోకాలు చదువుతున్నారు. వీరిలో ఓ మహిళ కిటికీ దగ్గర్లో కూర్చొని ఉండగా, బయట నుంచి ఓ దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్‌10న ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. దొంగ ఎత్తుకెళ్లిన బంగారు గొలుసు బరువు 30 గ్రాములు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..