iSmart News: నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్లలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి పట్టి దుక్కి దున్నడమే కాకుండా, విత్తనాలు కూడా నాటారు. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమానికి మంత్రి రైతు వేషధారణలో హాజరయ్యారు. బంతి పూలతో అలంకరించిన నాగలిని పట్టి, రైతులతో కలిసి పొన్నం ప్రభాకర్ పొలం దున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని పందిళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ పనుల్లో చురుకుగా పాల్గొన్నారు. పొలం దున్ని విత్తనాలు నాటే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని రైతులతో మమేకమయ్యారు. వ్యవసాయ పనులకు శుభారంభం పలికే “ఏరొక్క పున్నం” వేడుక సందర్భంగా, మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి పట్టి దుక్కి దున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు మద్దతుగా నిలిచారు. బంతి పూలతో అలంకరించిన నాగలిని పట్టి పొన్నం ప్రభాకర్ పొలం దున్నారు. అలాగే, ఆయన నెత్తికి రుమాలు ధరించి సంప్రదాయ రైతు వేషధారణలో కనిపించారు. ఈ కార్యక్రమం ద్వారా మంత్రి వ్యవసాయ రంగం పట్ల తనకున్న నిబద్ధతను చాటిచెప్పారు. స్థానిక రైతులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ప్లాస్టిక్ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్ నోట్లు బంద్?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్కార్డ్గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

