గన్నవరం చేరుకున్న భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి వీడియో
భారత మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి గన్నవరంలో ఘన స్వాగతం అందుకున్నారు. 2025 మహిళల ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు ఏపీ ప్రభుత్వం రూ. 2.5 కోట్లు, గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం ప్రకటించింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కలవనున్నారు.
భారత మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి గన్నవరం చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో మంత్రులు వనిత, సవిత, ఎంపీ కేశినేని చిన్ని ఘన స్వాగతం పలికారు. ప్రపంచ కప్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా రాణించిన శ్రీచరణి, తొమ్మిది మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు రూ. 2.5 కోట్లు, గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగం, కడపలో 1,000 గజాల ఇంటి స్థలం బహుమతిగా ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
