అభిమానాన్ని కూడా అమ్ముకునే వీరు.. సెలబ్రిటీలా? వీడియో
క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర విమర్శలు చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకుని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వీరిని ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అంటారని ప్రశ్నించారు. ఈడీ వారి ఆస్తులను జప్తు చేసింది. బెట్టింగ్ భూతం వేలాది మంది యువత జీవితాలను నాశనం చేస్తోందని సజ్జనార్ పేర్కొన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సి. సజ్జనార్ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీరు ఎలా ఆదర్శనీయమైన ఆటగాళ్లు అవుతారని ప్రశ్నించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ భూతానికి బానిసై వేలాది మంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సజ్జనార్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
