వరల్డ్కప్లో ఇకపై 10 జట్లు.. ఐసీసీ కీలక నిర్ణయం వీడియో
మహిళల వన్డే వరల్డ్ కప్ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8 జట్లకు బదులుగా 10 జట్లతో మెగా టోర్నీ నిర్వహించబడుతుంది. గత ప్రపంచ కప్ రికార్డు స్థాయిలో వీక్షకులను ఆకట్టుకుంది. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఇది మరో ముందడుగు. ఐసీసీ సమాన ప్రైజ్ మనీని కూడా అమలు చేసింది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన మహిళల వన్డే వరల్డ్ కప్ అపూర్వ విజయం సాధించింది. భారీగా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించడంతో పాటు రికార్డు స్థాయిలో వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్నీ విజయవంతం కావడంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దీనిని మరింత ఘనంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎనిమిది జట్లతో నిర్వహించబడుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్లో ఇకపై 10 జట్లకు అనుమతి లభించింది. రెండు కొత్త జట్ల చేరికతో వరల్డ్ కప్ సరికొత్తగా, మరింత పోటీతో సాగనుంది. భారత్లో జరిగిన గత ప్రపంచ కప్ మ్యాచ్లను దాదాపు 3 లక్షల మంది అభిమానులు స్టేడియానికి వచ్చి వీక్షించారు, ఇది మహిళల వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక రికార్డు. టీవీలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా కోట్లాది మంది మ్యాచ్లను తిలకించారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

