వరల్డ్కప్లో ఇకపై 10 జట్లు.. ఐసీసీ కీలక నిర్ణయం వీడియో
మహిళల వన్డే వరల్డ్ కప్ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8 జట్లకు బదులుగా 10 జట్లతో మెగా టోర్నీ నిర్వహించబడుతుంది. గత ప్రపంచ కప్ రికార్డు స్థాయిలో వీక్షకులను ఆకట్టుకుంది. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఇది మరో ముందడుగు. ఐసీసీ సమాన ప్రైజ్ మనీని కూడా అమలు చేసింది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన మహిళల వన్డే వరల్డ్ కప్ అపూర్వ విజయం సాధించింది. భారీగా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించడంతో పాటు రికార్డు స్థాయిలో వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్నీ విజయవంతం కావడంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దీనిని మరింత ఘనంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎనిమిది జట్లతో నిర్వహించబడుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్లో ఇకపై 10 జట్లకు అనుమతి లభించింది. రెండు కొత్త జట్ల చేరికతో వరల్డ్ కప్ సరికొత్తగా, మరింత పోటీతో సాగనుంది. భారత్లో జరిగిన గత ప్రపంచ కప్ మ్యాచ్లను దాదాపు 3 లక్షల మంది అభిమానులు స్టేడియానికి వచ్చి వీక్షించారు, ఇది మహిళల వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక రికార్డు. టీవీలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా కోట్లాది మంది మ్యాచ్లను తిలకించారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
