Vikarabad: కూలీలకు డబ్బులు పంచుతుండగా నోట్లపై ఏదో రాసి ఉంది.. ఏంటని చూడగా
ఆ మహిళ ఓ CSC సెంటర్ నుంచి రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లను తీసుకుంది. జనవరి 31న కూలీలకు జీతం డబ్బులు ఇస్తుండగా.. ఆ నోట్లపై ఏదో రాసి ఉన్నట్టు గమనించింది. ఇంతకీ అదేంటి అని చూడగా..
వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్ల కలకలం రేగింది. డబ్బులు డ్రా చేసేందుకు జనవరి 24న స్థానికంగా ఉన్న ఓ సీఎస్సీ సెంటర్కు వెళ్లిన సుగుణమ్మ అనే మహిళకు రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లు ఇచ్చాడు ఆ సెంటర్ నిర్వాహకుడు. ఇక జనవరి 31, శుక్రవారం కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లేక్కిస్తుండగా నకిలీ నోట్లను గుర్తించింది సదరు మహిళ. ఇదే విషయంపై CSC సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని తోసిపుచ్చాడు. అయితే ఆ నోట్లన్నీ కూడా ఆ CSC సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపిస్తోంది మహిళ. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కాగా, నకిలీ నోట్లన్ని కూడా స్పెసిమెన్ నోట్లు అని.. ఆ నోట్లపై ‘SPECIMEN NOT FOR SALE’ అని రాసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

