Vikarabad: కూలీలకు డబ్బులు పంచుతుండగా నోట్లపై ఏదో రాసి ఉంది.. ఏంటని చూడగా
ఆ మహిళ ఓ CSC సెంటర్ నుంచి రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లను తీసుకుంది. జనవరి 31న కూలీలకు జీతం డబ్బులు ఇస్తుండగా.. ఆ నోట్లపై ఏదో రాసి ఉన్నట్టు గమనించింది. ఇంతకీ అదేంటి అని చూడగా..
వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్ల కలకలం రేగింది. డబ్బులు డ్రా చేసేందుకు జనవరి 24న స్థానికంగా ఉన్న ఓ సీఎస్సీ సెంటర్కు వెళ్లిన సుగుణమ్మ అనే మహిళకు రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లు ఇచ్చాడు ఆ సెంటర్ నిర్వాహకుడు. ఇక జనవరి 31, శుక్రవారం కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లేక్కిస్తుండగా నకిలీ నోట్లను గుర్తించింది సదరు మహిళ. ఇదే విషయంపై CSC సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని తోసిపుచ్చాడు. అయితే ఆ నోట్లన్నీ కూడా ఆ CSC సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపిస్తోంది మహిళ. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కాగా, నకిలీ నోట్లన్ని కూడా స్పెసిమెన్ నోట్లు అని.. ఆ నోట్లపై ‘SPECIMEN NOT FOR SALE’ అని రాసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

