Vikarabad: కూలీలకు డబ్బులు పంచుతుండగా నోట్లపై ఏదో రాసి ఉంది.. ఏంటని చూడగా
ఆ మహిళ ఓ CSC సెంటర్ నుంచి రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లను తీసుకుంది. జనవరి 31న కూలీలకు జీతం డబ్బులు ఇస్తుండగా.. ఆ నోట్లపై ఏదో రాసి ఉన్నట్టు గమనించింది. ఇంతకీ అదేంటి అని చూడగా..
వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్ల కలకలం రేగింది. డబ్బులు డ్రా చేసేందుకు జనవరి 24న స్థానికంగా ఉన్న ఓ సీఎస్సీ సెంటర్కు వెళ్లిన సుగుణమ్మ అనే మహిళకు రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లు ఇచ్చాడు ఆ సెంటర్ నిర్వాహకుడు. ఇక జనవరి 31, శుక్రవారం కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లేక్కిస్తుండగా నకిలీ నోట్లను గుర్తించింది సదరు మహిళ. ఇదే విషయంపై CSC సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని తోసిపుచ్చాడు. అయితే ఆ నోట్లన్నీ కూడా ఆ CSC సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపిస్తోంది మహిళ. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కాగా, నకిలీ నోట్లన్ని కూడా స్పెసిమెన్ నోట్లు అని.. ఆ నోట్లపై ‘SPECIMEN NOT FOR SALE’ అని రాసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

