Vikarabad: కూలీలకు డబ్బులు పంచుతుండగా నోట్లపై ఏదో రాసి ఉంది.. ఏంటని చూడగా
ఆ మహిళ ఓ CSC సెంటర్ నుంచి రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లను తీసుకుంది. జనవరి 31న కూలీలకు జీతం డబ్బులు ఇస్తుండగా.. ఆ నోట్లపై ఏదో రాసి ఉన్నట్టు గమనించింది. ఇంతకీ అదేంటి అని చూడగా..
వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్ల కలకలం రేగింది. డబ్బులు డ్రా చేసేందుకు జనవరి 24న స్థానికంగా ఉన్న ఓ సీఎస్సీ సెంటర్కు వెళ్లిన సుగుణమ్మ అనే మహిళకు రూ. 30 వేలు విలువ చేసే 500 నోట్లు ఇచ్చాడు ఆ సెంటర్ నిర్వాహకుడు. ఇక జనవరి 31, శుక్రవారం కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు లేక్కిస్తుండగా నకిలీ నోట్లను గుర్తించింది సదరు మహిళ. ఇదే విషయంపై CSC సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని తోసిపుచ్చాడు. అయితే ఆ నోట్లన్నీ కూడా ఆ CSC సెంటర్ నిర్వాహకుడే ఇచ్చాడని ఆరోపిస్తోంది మహిళ. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కాగా, నకిలీ నోట్లన్ని కూడా స్పెసిమెన్ నోట్లు అని.. ఆ నోట్లపై ‘SPECIMEN NOT FOR SALE’ అని రాసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
