Hyderabad: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని నిరూపించుకున్నాడు ఓ వ్యక్తి. తాను ఉదయాన్నే రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా.. అతడికి ఓ నల్లటి బ్యాగ్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా..
మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని నిరూపించుకున్నాడు ఓ వ్యక్తి. తాను ఉదయాన్నే రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా.. అతడికి ఓ నల్లటి బ్యాగ్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా.. ఒక్కసారిగా కళ్లు జిగేల్ అనిపించాయి. ఇంతకీ ఆ వివరాలు ఇలా.. హైదరాబాద్లోని లాలాపేటకు చెందిన సతీష్ యాదవ్ అనే వ్యక్తికి ఉదయం లాలాపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డుపై రెండు లక్షల రూపాయలు కనబడ్డాయి. వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిషోర్ యాదవ్కు సమాచారం అందజేసి ఆయన సహాయంతో లాలాగూడ పోలీసులను సంప్రదించి సదరు రెండు లక్షల రూపాయలు పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు సతీష్ యాదవ్, కిషోర్ యాదవ్లను అభినందించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

