కూల్ న్యూస్.. ఈ ఏడాదికి వేసవి ముగిసినట్టేనా !!

Updated on: May 17, 2024 | 4:41 PM

తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉన్న ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు తగ్గింది. దీనికి కారణం ఉపరితల ఆవర్తనమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అవర్తనం ఏర్పడిందని.. దీని కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు.

తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉన్న ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు తగ్గింది. దీనికి కారణం ఉపరితల ఆవర్తనమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అవర్తనం ఏర్పడిందని.. దీని కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ శరీరంలో కేలొరీలను ఇలా సులువుగా తగ్గించుకోండి

అందుకే నాకు పిల్లలు వద్దు.. రూ. 28 వేల కోట్ల ఆస్తిని ఎవరికిస్తానంటే

బైడెన్‌ను చంపాలనుకున్నా.. విచారణలో తెలుగు కుర్రాడు సాయి వర్షిత్‌

తేలు కుట్టిన చోట ఉల్లిపాయ రుద్దితే విషం విరిగిపోతుందా ?? నిజమెంత ??

Air India Express: విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై

Published on: May 17, 2024 12:05 PM
Follow Us