వీడు మామూలోడు కాదు.. ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు !! వీడియో

|

Jan 04, 2022 | 9:05 AM

బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌ను అమ్మేశాడు.

బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌ను అమ్మేశాడు. ఇప్పుడిది రైల్వే శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. బిహార్‌లోని సమస్తీపూర్ రైల్వే డివిజన్‌లో ఓ పాత ఆవిరి రైల్ ఇంజిన్ ఉంది. ఇదే డివిజన్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ రంజన్ ఝా.. దానిపై కన్నేశాడు. నకిలీ ధృవపత్రాలతో దానిని స్క్రాప్ మాఫియాకు అమ్మేశాడు. ఈ వ్యవహారంలో రాజీవ్‌కు స్థానిక పోలీసు అధికారితో పాటు.. రైల్వే శాఖలోని ఇతర సిబ్బంది కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం డిసెంబర్ 14న చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. రైలు ఇంజిన్‌ అమ్మకానికి సంబంధించి నకిలీ ధృవపత్రాలను రాజీవ్ సృష్టించాడు. దాని ఆధారంగా ఇంజిన్‌ను స్క్రాప్ మాఫియాకు విక్రయించాడు. డిసెంబర్ 14వ తేదీన రాజీవ్.. రైల్వే శాఖలో ఓ హెల్పర్ సాయంతో గ్యాస్ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను స్క్రాప్‌లా మార్చే ప్రయత్నం చేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Hiccups: పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి.. వీడియో

Diabetes: డయాబెటీస్‌ పేషంట్లకు గుడ్‌ న్యూస్‌ !! వీడియో

Credit Card: సమయానికి క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది ?? వీడియో

ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా !! ఇది తప్పకుండా తెలుసుకోవాలి.. వీడియో

స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్‌ ఏంటంటే ?? వీడియో

 

 

Follow us on