Watch: మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు
ఏపీలో తదుపరి ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో రెండేళ్లే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. ఏపీలో 2027లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
ఏపీలో మరో రెండేళ్లే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలతో ఏపీలో 2027లోనే ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుని అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించకూడదని వార్నింగ్ ఇచ్చారు. మద్యం టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిబంధనలన్నీ పేపర్లకే పరిమితం అయ్యాయని.. కలెక్టర్లు సైతం ఏం చేయలేని స్థితిలో ఉన్నారని కాకాణి అన్నారు. మద్యం షాపుల లాటరీలో 90 శాతం టీడీపీ నేతలకే దక్కాయని వ్యాఖ్యానించారు. ముందస్తు ప్రణాళిక మేరకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో లాటరీ జరిగిందని ఆరోపించారు.
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
అరుదైన బావురుపిల్లిని చూసారా ??
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

