చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ.. మేళ తాళాలతో గ్రామస్థుల ఘన స్వాగతం

|

Jun 17, 2024 | 6:25 PM

చంద్రబాబు విషయంలో ఐదేళ్లు గ్రామానికి దూరంగా ఉండి తన పంతం నెగ్గిన తర్వాత ఊరికి వచ్చిన మహిళకు ఘన స్వాగతం పలికిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టింది విజయలక్ష్మి. ఇప్పుడు తన పంతం నెగ్గడంతో శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలోని పుట్టింటికి వచ్చారు.

చంద్రబాబు విషయంలో ఐదేళ్లు గ్రామానికి దూరంగా ఉండి తన పంతం నెగ్గిన తర్వాత ఊరికి వచ్చిన మహిళకు ఘన స్వాగతం పలికిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టింది విజయలక్ష్మి. ఇప్పుడు తన పంతం నెగ్గడంతో శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలోని పుట్టింటికి వచ్చారు. కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా గోపయ్య, సౌభాగ్యమ్మ దంపతుల నాలుగో కుమార్తె విజయలక్ష్మికి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన పెదనాటి నర్సింహారావుతో వివాహమైంది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. కేశవాపురంలో తల్లిదండ్రుల నివాసంలోనే ఉంటున్న తోబుట్టువు వద్దకు విజయలక్ష్మి వస్తుంటారు. ఈక్రమంలో ఐదేళ్ల కిందట తన ఇద్దరు కుమారులతో కలిసి ఊరికి వచ్చిన ఆమెకు.. అక్క కొడుకు తాళ్లూరి ప్రసాద్‌కు మధ్య రాజకీయంగా విభేదాలు తలెత్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!

పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన మ్యారేజ్ ఇన్విటేషన్

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా ఊహించని షాక్

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు..

600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!

Follow us on