Watch Video: త్వరలో కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. మునుకోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. మునుకోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంటకస్వామి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థంపుచ్చుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై టీవీ9తో మాట్లాడిన కోమటిరెడ్డి.. కొండా విశ్వేశ్వర్రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యం అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్ఫామ్పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

