అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Edited By:

Updated on: Mar 16, 2023 | 3:26 PM

ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అలాగే స్పీకర్ పోడియంపై టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు. దీనితో మరోసారి వారిని స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సభ నుంచి సస్పెన్షన్ వేటు పడింది. అయితే టీడీపీ ఎమ్మెల్యేల్లో పయ్యావుల కేశవ్,  నిమ్మల రామానాయుడు, వైసీపీ రెబల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఈ శాసనసభ సమావేశాలు పూర్తయ్యేవరకు  సస్పెన్షన్  విధించగా.. మిగిలినవారిపై ఈ ఒక్క  రోజే  సభ నుంచి  సస్పెండ్  చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలను  ప్రారంభించేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చిన సమయంలో ఆయనకు సాదర స్వాగతం లభించలేదని, సమయానికి సీఎం జగన్ రాకపోవడంతో గవర్నర్ 5 నిముషాల పాటు స్పీకర్ చాంబర్‌లో వేచి ఉండాల్సి వచ్చిందని  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

4 సెకండ్లలో రూ.40 లక్షలు మాయం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఒళ్లో భారీ కొండచిలువతో యువతి .. అయినా కూల్‌గా సెల్‌ఫోన్ చూస్తూ !!

చిరు జ్ఞాపకాలు.. ట్రైన్ జర్నీ లో మీరెప్పుడైనా ఇలా చేశారా ??

Jr NTR: అసలే ఆస్కార్ స్టేజ్‌.. కొంచెం చూసుకోవాలి కదన్నా

Chiranjeevi: కొడుకు కోసం బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరు..

Published on: Mar 16, 2023 01:38 PM
Loading...
Unable to load recommendations.
Follow Us