పంతం నెగ్గించుకున్న బాలకృష్ణ.. ఏం చేశారంటే? వీడియో
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్ను హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు.
పార్టీ మారిన కౌన్సిలర్లకు కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. దానికి పోటీగా జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్ల నినాదాలు చేశారు. హిందూపుర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మొదటి నుంచీ ఉత్కంఠ రేపింది. టీడీపీ నుంచి రమేష్, వైసీపీ నుంచి లక్ష్మి పోటీలో ఉన్నారు. చివరకు రమేష్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.. తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బాయికాట్ చేశారు. ఎన్నిక జరుగుతున్న సమయంలో పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
