Delhi: జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ.. హాజరవ్వనున్న రాహుల్, ఖర్గే
ఢిల్లీలోని AICC కేంద్ర కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్తో రాహుల్ గాంధీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, కేసీ వేణుగోపాల్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశానికి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథరెడ్డి, అరికెల నర్సారెడ్డి హాజరయ్యారు
రాహుల్తో భేటీ అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తమకు బీజేపీ, కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినట్లు తెలిపారు. తాము ప్రాంతీయ పార్టీ దిశగా ఆలోచన చేశామని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిపారు. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. సోనియాకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం అని.. జూలై 2న కాంగ్రెస్లో చేరబోతున్నట్లు పొంగులేటి తెలిపారు.
Published on: Jun 26, 2023 05:00 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

