Hyderabad: యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్, ఇతర మంత్రులు.. కేసీఆర్కు పరామర్శ
సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను స్వయంగా పరామర్శించారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు ఇతర మంత్రులు సైతం ఆస్పత్రికి వచ్చారు. హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కేసీఆర్.
సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను స్వయంగా పరామర్శించారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు ఇతర మంత్రులు సైతం ఆస్పత్రికి వచ్చారు. కాగా, గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆయన్ను యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గాయం తీవ్రత నేపథ్యంలో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కేసీఆర్. వాకర్ సాయంతో కేసీఆర్ను వైద్య బృందం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. 8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

