Telangana: హామీల విషయంలో మాట మార్చారు.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే అందరికీ అన్నీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు షరతులతో కొందరికి కొన్ని మాత్రమే ఇస్తామంటోందని అన్నారు.

Telangana: హామీల విషయంలో మాట మార్చారు.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఘాటు విమర్శలు

|

Updated on: Feb 27, 2024 | 5:31 PM

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే అందరికీ అన్నీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు షరతులతో కొందరికి కొన్ని మాత్రమే ఇస్తామంటోందని అన్నారు. ఇచ్చిన హామీలను ఇలా ఎగ్గొడితే ప్రజలు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్‌ఎస్‌ లేకుండా చేయడం రేవంత్ రెడ్డి తరం కాదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఎవరి దుకాణం వారిదే అని కామెంట్ చేశారు. ఆరు తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ నేతలు వారిని వాళ్లే తన్నుకు చస్తారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో సీన్ రివర్స్ కావాలని.. భువనగిరిలో గెలిచి సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Follow us