Watch Video: విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ప్రజలకే నష్టం.. KA Paul ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తే అన్ని పార్టీలు తనకు మద్ధతు ఇస్తాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ పోటీ చేయడం లేదని, తనకు మద్ధతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. అటు టీడీపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్యానించారు.
విశాఖ ఎంపీగా తనను గెలిపించకపోతే రాష్ట్రం ఉండదు.. దేశమూ ఉండదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అక్కడి నుంచి తనను ఎంపీగా గెలిపించకపోతే ప్రజలకే నష్టమని వ్యాఖ్యానించారు. అదే సమయంలో విశాఖ నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తే అన్ని పార్టీలు తనకు మద్ధతు ఇస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ పోటీ చేయడం లేదని, తనకు మద్ధతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. అటు టీడీపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్యానించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తనకు మద్ధతుగా విశాఖలో ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారో, లేదో తనకు తెలియదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేస్తానన్న తన మాటను నిలబెట్టుకున్నానని కేఏ పాల్ ప్రకటించారు. పార్లమెంటులో ప్రధాని మోదీని ఎదుర్కొనే దమ్ము తనకు మాత్రమే ఉందంటూ పొలిటికల్ పంచ్లు విసిరారు పాల్.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

