AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: షాకింగ్ వీడియో.. చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో దూసుకెళ్లిన ట్రైన్

CM Chandrababu: షాకింగ్ వీడియో.. చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో దూసుకెళ్లిన ట్రైన్

Ram Naramaneni
|

Updated on: Sep 05, 2024 | 5:20 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్రా నగర్ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే ట్రాక్‌పైకి ఒక్కసారిగా ట్రైన్‌ దూసుకువచ్చింది. అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది.. రైలును ఆపమని సూచించేందుకు ఎర్ర జెండాను ఊపారు. చంద్రబాబు అక్కడ ఇరుకైన బ్రిడ్జిపై నిల్చుని ఉండగా.. ట్రైన్ కాస్త స్లో అయ్యి ముందుకెళ్లింది.

విజయవాడలో ఊహించని ఘటన జరిగింది.  చంద్రబాబు బుడమేరు పరిశీలనలో ఊపిరిబిగబట్టే సీన్ వెలుగుచూసింది. మధురానగర్‌లో బుడమేరు గండిని పరిశీలించేందుకు వెళ్లారు సీఎం. అయితే  గండి సరిగా కనిపించడంలేదని మధురానగర్‌ రైల్వే ట్రాక్‌పైకి ఎక్కారు. అదే సమయంలో ట్రాక్‌పై దూసుకెళ్లింది ట్రైన్. ఆ సమయంలో ట్రాక్‌పై పక్కన ఉన్న ఇరుకైన స్థలంలోనే చంద్రబాబు సహా ఆయన భద్రతా సిబ్బంది నిల్చున్నారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోయినప్పటికీ.. కొన్ని క్షణాలు అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకుంది. అయితే సీఎం వెళ్తానన్నా.. భద్రతా అధికారులు వెళ్లనివ్వకుండా ఉండాల్సిందని ఇది సెక్యూరిటీ బ్రీచ్ అని చెబుతున్నారు కొందరు రిటైర్డ్ సెక్యూరిటీ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.