CM Chandrababu: హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్

Edited By:

Updated on: Feb 25, 2026 | 4:08 PM

తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ పై నిందలను ఖండించి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి టెండర్లు, నాణ్యతలో అక్రమాలు జరిగాయని ఆధారాలు ప్రస్తావించారు. వైసీపీ ఈ ఆరోపణలను ఖండించింది, ఇది పాత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.

తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ కు టీటీడీ నెయ్యి కొనుగోళ్లతో సంబంధం లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు సిట్ నివేదికలోని సప్లిమెంటరీ చార్జ్ షీట్ పేజ్ నెం. 35, మెయిన్ చార్జ్ షీట్ 21వ పేజీలలో స్పష్టంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం

కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌ మరణాలకు కారణం అదేనా ??

పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా

Published on: Feb 25, 2026 04:07 PM
Loading...
Unable to load recommendations.
Follow Us