YS Jagan: జగన్ ఇంటిని తాకిన లడ్డూ లడాయి.. బీజేవైఎం ఆందోళన..
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
లడ్డూ లడాయి… తాడేపల్లిలోని జగన్ ఇంటిని తాకింది. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ తాడేపల్లిలోని జగన్ ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం నేతలు యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ ఇంటి దగ్గర బందోబస్తు పెంచారు.
శ్రీవారి ప్రసాదంపై ప్రభుత్వంది ముమ్మాటికి అసత్య ప్రచారమే అంటూ నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం స్థాయి మరిచి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తే… రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నారంటూ భూమన భగ్గుమన్నారు. మొత్తంగా… గతకొన్ని రోజులుగా లడ్డూపై నడుస్తున్న పొలిటికల్ ఫైట్ పీక్స్కి వెళ్లింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

