Khelo India University Games 2021: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. లైవ్ వీడియో
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం నుంచి ప్రారంభం. కరోనా కారణంగా, గత సంవత్సరం ఈ ప్రత్యేక ఆటలను నిర్వహించలేదు. ఈ సారి కరోనా అదుపులోనే ఉండటంతో ఈ ప్రత్యేక టోర్నమెంట్ను పూర్తి సన్నాహాలతో నిర్వహిస్తున్నారు.
బెంగళూర్ కంఠీరవ స్టేడియంలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అనుగార్ ఠాకూర్ నిశిత్ ప్రామాణిక్ తదితరులు హాజరయ్యారు . గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ , కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై కూడా పాల్గొన్నారు
దేశం నలుమూలల నుంచి 3,879 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కు విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. 200 యూనివర్సిటీలకు చెందిన క్రీడాకారులు ఈవెంట్లో పాల్గొంటెన్నారు.20 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. మల్లకాంబ , యోగాసన లాంటి స్వదేశీ క్రీడలను కూడా ఈసారి పోటీల్లో ప్రోత్సహిస్తున్నారు. వివిధ విభాగాల్లో 375 గోల్డ్మెడల్స్ కోసం క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ అంశంపై ప్రత్యేక కోర్సు.. విద్యార్థులతో పాటు లెక్చరర్లూ వీడియోలు చూసేలా.. ఇంతకీ ఎక్కడంటే
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

