AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరదలో బస్సు.. తాళ్లసాయంతో బయటకొచ్చిన ప్రయాణీకులు

వరదలో బస్సు.. తాళ్లసాయంతో బయటకొచ్చిన ప్రయాణీకులు

Phani CH
|

Updated on: Nov 10, 2023 | 8:42 PM

Share

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి..నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జన జీవనాన్ని అస్తవ్యస్తంగా మారింది. నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడి పట్టాలపై పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. వీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. వర్షాలతో దక్షిణ తమిళనాడులో భారీగా పంట నష్టం వాటిల్లింది. తూత్తుకుడిలో భారీవర్షలాకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి..నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జన జీవనాన్ని అస్తవ్యస్తంగా మారింది. నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడి పట్టాలపై పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. వీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. వర్షాలతో దక్షిణ తమిళనాడులో భారీగా పంట నష్టం వాటిల్లింది. తూత్తుకుడిలో భారీవర్షలాకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సబ్‌ వేలో వరదనీటిలో బస్సు చిక్కుకుపోయింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు రెస్క్యూ టీం. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నవంబర్‌ 10 వరకూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొలి విడత గోల్డ్‌ బాండ్లపై పెట్టుబడి పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్‌

కూలీని లక్షాధికారిని చేసిన వజ్రం.. 10 లక్షల నగదు, ఐదు తులాల బంగారం ఇచ్చి కొన్న వ్యాపారి

గుండెపోటుతో యజమాని మృతి.. పొలం నుంచి పరుగున వచ్చిన ఆవు ఏం చేసిందంటే ??