120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు

Updated on: Jan 11, 2026 | 6:41 PM

హనుమకొండ జిల్లాలో దారుణమైన వీధి కుక్కల ఘటన వెలుగులోకి వచ్చింది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది చంపి పాతిపెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సర్పంచ్‌తో సహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో వందలాది వీధి కుక్కలను చంపి సామూహికంగా పాతిపెట్టినట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, 120కి పైగా వీధి కుక్కలను అమానుషంగా హతమార్చి, రహస్యంగా పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక పంచాయతీ సిబ్బందే ఈ అకృత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AP High Court: సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Hyderabad : చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు

Sankranthi 2026 : తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు

మరణశిక్షే !! ఇరాన్‌ బెదిరింపు ఆగని నిరసనలు