నిర్మల్ జిల్లాలో పశువుల కాపరిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్.. వీడియో ఇదిగో

Updated on: Aug 28, 2025 | 3:41 PM

భారీ వర్షాలు, వరదలతో నిర్మల్ జిల్లా అతలా కుతలమైంది. అయితే.. నిర్మల్‌ జిల్లాలో ఓ పశువుల కాపరి వరలో చిక్కుకుపోయాడు.. దీంతో NDRF టీమ్‌ అతికష్టం మీద కాపరిని కాపాడింది. ముంపెల్లి దగ్గర వాగులో పశువుల కాపరి చిక్కుకున్నాడు.. 6 గంటలపాటు కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు.

భారీ వర్షాలు, వరదలతో నిర్మల్ జిల్లా అతలా కుతలమైంది. అయితే.. నిర్మల్‌ జిల్లాలో ఓ పశువుల కాపరి వరలో చిక్కుకుపోయాడు.. దీంతో NDRF టీమ్‌ అతికష్టం మీద కాపరిని కాపాడింది. ముంపెల్లి దగ్గర వాగులో పశువుల కాపరి చిక్కుకున్నాడు.. 6 గంటలపాటు కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. చివరికి రెస్క్యూ టీమ్‌ బోట్‌లో ఆ వ్యక్తిని క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అందరూ ఊరిపీల్చుకున్నారు. సహాయకచర్యలను ఎస్పీ జానకి పర్యవేక్షించారు. ముందు హెలికాప్టర్ పంపాలని ప్రభుత్వాన్ని కోరారు ఎస్పీ.. అయితే.. కాస్త వరద ప్రవాహం తగ్గిన తర్వాత బోట్‌ సాయంతో దిబ్బపై ఉన్న అతని దగ్గరకువెళ్లి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కాగా.. నిన్నటి నుంచి ఆ వ్యక్తి అక్కడే చిక్కుకుపోగా.. క్షేమంగా అతన్ని కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.