హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ పరిధిలో వరుసగా గంజాయి చాకెట్ల విక్రయం కలకలం రేపుతోంది. జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్స్, పౌడర్ ను విక్రయిస్తున్న కిరాణా దుకాణాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు, గంజాయి పౌడర్ ను పట్టుకున్నారు. జగద్గిరిగుట్టలోని రోడ్డు నెంబర్ వన్ జయశ్రీ ట్రేడర్స్ కిరాణా షాపులో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 160 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు, 4 కిలోల గంజాయి పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ పరిధిలో వరుసగా గంజాయి చాకెట్ల విక్రయం కలకలం రేపుతోంది. జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్స్, పౌడర్ ను విక్రయిస్తున్న కిరాణా దుకాణాలపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు, గంజాయి పౌడర్ ను పట్టుకున్నారు. జగద్గిరిగుట్టలోని రోడ్డు నెంబర్ వన్ జయశ్రీ ట్రేడర్స్ కిరాణా షాపులో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 160 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు, 4 కిలోల గంజాయి పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి చాక్లెట్స్ కోల్ కతాకు చెందిన మోహన్ అనే వ్యాపారి రెగ్యులర్ గా సప్లయి చేస్తున్నట్లు తెలిపాడు. పట్టుబడిన 160 చాకెట్ల ప్యాకెట్ల విలువ సుమారు 2 లక్షల 56 వేలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన సరఫరాదారుడు మోహన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కాంబోడియా అప్సరస’గా భారత దౌత్యవేత్త
షూట్ విషయంలో గొడవ పడిన యూట్యూబర్ జంట !! క్షణికావేశంలో బిల్డింగ్పై నుంచి !!
జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో..
జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం
రెచ్చిపోయిన రోడ్సైడ్ రోమియోలు..
దర్జాగా రోడ్డు దాటిన పులి.. నిలిచిపోయిన వాహనాలు..
జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో
పాపం.. గోల్డ్ అనుకొని స్కెచ్ వేశారు.. చివరికి..
ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

