పోలీస్ అధికారికి హారతి !! దంపతుల వినూత్న నిరసన !!
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి హారతి ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఒక జ్యుయలరీ షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది అర్పిత్, ముఖేష్ కలిసి నాలుగు కిలోల వెండిని చోరీ చేసి పారిపోయారు. ఈ చోరీ గురించి ఆ షాపు యజమాని రేవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన నిందితులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు.
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి హారతి ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఒక జ్యుయలరీ షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది అర్పిత్, ముఖేష్ కలిసి నాలుగు కిలోల వెండిని చోరీ చేసి పారిపోయారు. ఈ చోరీ గురించి ఆ షాపు యజమాని రేవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన నిందితులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై జ్యుయలరీ షాపు దంపతులు అనురాధ, కుల్దీప్ సోని అసంతృప్తి చెందారు. ఈ నెల 6న ఆ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. సీఐ జేపీ పటేల్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయనకు హారతి ఇచ్చారు. మెడలో పూల దండ వేసి శాలువా కప్పేందుకు ప్రయత్నించారు. దీనికి ఒప్పుకోని ఆ పోలీస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ దంపతులు తనను అవమానించారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఆ పోలీస్ అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు దృష్టికి కూడా ఇది వెళ్లగా, ఆ దంపతుల ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

