కన్నుల పండువగా కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం..
తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ ప్రసిద్ధ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం వేదపండితుల నడుమ వేదోచ్చారణలతో కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో నిండిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ ప్రసిద్ధ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం వేదపండితుల నడుమ వేదోచ్చారణలతో కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుండి ప్రతి ఏటా వచ్చే భక్తులకు స్వామివారి కళ్యాణంలో పాల్గొనేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. అనంతరం స్వామి కళ్యాణం విశిష్టతను వివరిస్తూ, తెల్లవారుజామున వరకు మహోత్సవం సాగింది. స్వామి కల్యాణం చూసేందుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామి కళ్యాణ మహోత్సవం ముందుగా అంకురార్పణతో మొదలై గ్రామ పురవీధుల్లో పెద్ద రథంపై ఊరేగింపుగా సాగింది. రథోత్సవం సమయంలో గ్రామ ఆచారం ప్రకారం అరటిపండ్లుతో ప్రత్యేక ఘట్టం సాగింది. అరటి పండ్లను రథంపై వేస్తే కొరినకోర్కెకెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే అరటిపండ్లు రథంపై విసురుతూ ఊరేగింపు ముందుకు సాగింది. ఈ ఏడాది అకాలవర్షం పడడంతో రథోత్సవానికి కొంత అంతరాయం కల్గినప్పటికీ.. భక్తులు ఏ మాత్రం తగ్గకుండా స్వామి ఊరేగింపు సాఫీగా సాగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్జీపీటీ ‘ఓకే’ అంటేనే..

