Watch: వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. అందరూ చూస్తుండగానే ఇలా..

|

Sep 02, 2024 | 1:15 PM

వరదలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. ఒక్కసారిగా పాలేరు రిజర్వాయర్ వరద వారి ఇంటిని చుట్టిముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వారంతా ఇంటిపైకప్పు ఎక్కారు. రిస్క్యూ టీమ్, పోలీసులు రూలర్ సాయంతో వారికి సేఫ్టీ జాకెట్స్ అందజేశారు. వరద పెరిగి ఇంటిగోడ కూలడంతో తల్లిదండ్రులు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, నాయకన్ గూడెం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. ఒక్కసారిగా పాలేరు రిజర్వాయర్ వరద వారి ఇంటిని చుట్టిముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వారంతా ఇంటిపైకప్పు ఎక్కారు. రిస్క్యూ టీమ్, పోలీసులు రూలర్ సాయంతో వారికి సేఫ్టీ జాకెట్స్ అందజేశారు. వరద పెరిగి ఇంటిగోడ కూలడంతో తల్లిదండ్రులు షేక్ యాకూబ్, సైదాబీ, కుమారుడు షరీఫ్ గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us on