గుడ్ న్యూస్.. ట్రైన్‌లో ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే ??

|

Nov 19, 2022 | 9:26 AM

రైళ్లలో ఆహారం విషయంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్‌లో ప్రాంతీయ, స్థానిక వంటలకు ప్రాధాన్యమిచ్చేందుకు నిర్ణయించింది.

రైళ్లలో ఆహారం విషయంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్‌లో ప్రాంతీయ, స్థానిక వంటలకు ప్రాధాన్యమిచ్చేందుకు నిర్ణయించింది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి, చిన్నారులకు, ఆరోగ్యంపై శ్రద్ధ కలిగిన వ్యక్తులు కోరే ఆహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా వీలుగా మెనూలో మార్పులు చేసే సౌలభ్యాన్ని ఐఆర్‌సీటీసీకి కల్పించింది. కేటరింగ్‌ విభాగాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు ఆహారం విషయంలో మరిన్ని ఆప్షన్లు ఇచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ వంటకాలు, సీజనల్‌ వంటకాలతో పాటు, పండగ రోజుల్లో ప్రత్యేక ఆహారాన్ని అందించేందుకు వీలుగా మెనూలో మార్పులు చేసేందుకు ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు అవకాశం కల్పించింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, చిన్నారులకు అవసరమైన ఆహారం, తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని అందించేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి రైల్వే బోర్డు ఆమోదించిన మెనూనే రైళ్లలో ఐఆర్‌సీటీసీ సప్లయ్‌ చేస్తూ వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. మ్యూజియంలో అతని..

ఏడేళ్లుగా ప్రేమించి, పెళ్లాడి మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త !!

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

అరే !! ఇంత రాక్షసత్వమా.. కుక్కకు ఉరి వేసి చంపిన దుండగులు !!

మిత్రుడి పెళ్లికి హాజరైన అమెరికా ఫ్రెండ్స్‌.. వాళ్ల వేషధారణ చూసి.. !!

 

Follow us on