చదివింది టెన్త్.. డాక్టర్ అవతారమెత్తి.. ప్రాణాలతో చెలగాటం !!
చదివింది పదో తరగతి. చేసేది డాక్టర్ వృత్తి. అదేంటీ టెన్త్ చదివితే డాక్టర్ అవ్వొచ్చా? అని ఆశ్చర్యపోకండి. హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయటపడిన నకిలీ డాక్టర్ వ్యవహారంలో ఇలాంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పరిధిలో ఏకంగా దవఖానానే తెరిచాడు. ఫేక్ డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు అందింది. దాంతో సదరు క్లినిక్పై దాడి చేసి ఫేక్ డాక్టర్ తుహిన్ కుమార్ మండల్ను అరెస్టు చేశారు.
చదివింది పదో తరగతి. చేసేది డాక్టర్ వృత్తి. అదేంటీ టెన్త్ చదివితే డాక్టర్ అవ్వొచ్చా? అని ఆశ్చర్యపోకండి. హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయటపడిన నకిలీ డాక్టర్ వ్యవహారంలో ఇలాంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ పరిధిలో ఏకంగా దవఖానానే తెరిచాడు. ఫేక్ డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు అందింది. దాంతో సదరు క్లినిక్పై దాడి చేసి ఫేక్ డాక్టర్ తుహిన్ కుమార్ మండల్ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని మారేడ్పల్లి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లోని నార్త్జోన్ కమిషనర్ టాస్క్ఫోర్స్ సిబ్బంది మారేడ్పల్లి పరిధిలోని తుకారాంగేట్లో సోదాలు నిర్వహించారు. మీనా హాస్పిటల్ పక్కన గీతా క్లినిక్ పేరుతో పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ట్రీట్మెంట్ నిర్వహిస్తున్న 30 ఏళ్ళ తుహిన్ కుమార్ మండల్ అనే నకిలీ వైద్యున్ని పట్టుకున్నారు. ఏకంగా గీతా క్లినిక్ పేరిట చిన్నా హాస్పిటల్ సెటప్ చేశాడు డాక్టర్ టి.కె.మండల్. పక్కా సమాచారంతో టస్క్పోర్స్ పోలీసులు దాడి చేసి గుట్టురట్టు చేశారు.. అతని క్లినిక్ నుంచి ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్లు, పైల్స్ ట్రీట్మెంట్ సాధనాలను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాఠాలు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూమ్లో పడకేసి.. వీడియో తీసి నెట్టింట షేర్ చేసిన స్థానికులు
మెట్రో రైల్లో ఫన్నీ సీన్.. రిస్కీ ఫీట్ చేయబోయిన చిన్నోడికి మైండ్బ్లాక్
Kushi OTT: సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి
గణపతి లడ్డూకి హై సెక్యూరిటీ.. ఎవరో తెలుసా ??
ఊరేగింపులో ఉత్సాహంగా ఉరికాడు.. ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

