ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య

Edited By:

Updated on: Feb 24, 2026 | 8:58 PM

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని రామ్‌రాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామ్‌రాజ్, మాధవి, శశాంక్. సూసైడ్ నోట్‌లో ఆర్థిక ఇబ్బందులు కారణమని రామ్‌రాజ్ పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామ్‌రాజ్ సోదరుడు ఆర్థిక సమస్యలను ఖండించారు. కూతురు అమూల్యకు ఆస్తులు రాసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని రామ్‌రాజ్ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ్‌రాజ్ పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. తన ఆస్తులన్నీ కొంపల్లిలో నివసిస్తున్న కుమార్తె అమూల్యకు చెందుతాయని వీలునామా కూడా రాసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రామ్‌రాజ్ సోదరుడు ఆర్థిక సమస్యలను ఖండించారు. తమ కుటుంబం బాగా స్థిరపడిందని, ఆత్మహత్యకు అసలు కారణం తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్

Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

Follow Us