Hyderabad: మీరు ఇక ఎప్పటికీ మారరా.? ఈ సీన్ చూస్తే మందుబాబులు గగ్గోలు పెడతారు
బషీర్బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 2003 ఫారిన్ లిక్కర్ బాటిల్ లను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్నారు. హరీష్ కుమార్ ఇర్వాణి అనే వ్యక్తి గతలో మద్యం వ్యాపారిగా కొనసాగారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
హైదరాబాద్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. బషీర్బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలోని.. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో 233 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ 22లక్షలు ఉంటుందన్నారు. ప్రధాన నిందితుడు హరీష్ కుమార్ ఈర్వాణీతో పాటు.. విలియమ్స్ జోసెఫ్లను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు వ్యాపారులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్పై కూడా కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.