మీ ఎజెండా, మైలేజ్‌ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??

క్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు ఫిల్మ్ వర్గాల్లో ఈ జంటకు సంబంధించి నిత్యం ఏదోక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించడంతో అటు సినీ ప్రముఖులతోపాటు ఇటు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు.

మీ ఎజెండా, మైలేజ్‌  కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??

|

Updated on: Oct 04, 2024 | 12:47 PM

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు ఫిల్మ్ వర్గాల్లో ఈ జంటకు సంబంధించి నిత్యం ఏదోక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించడంతో అటు సినీ ప్రముఖులతోపాటు ఇటు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ఇద్దరూ విడిపోవడానికి కారణాలు తెలియనప్పటికీ.. చైతూ, సామ్ తమ కెరీర్‏లో బిజీగా ఉన్నారు. ఇటీవలే చైతూకు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. అలాగే సామ్ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చైతూ, సామ్ విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో కొండ సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మీ రాజకీయాల కోసం సినీ తారల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సురేఖతో పాటు.. రాజకీయ నాయకులకు సమంత రిక్వెస్ట్

Prakashraj: ప్రకాశ్‌రాజ్‌ పోస్టుల పరంపర వెనుక కారణం ఏమిటి ??

TOP 9 ET News: రూ.396 కోట్లు దిమ్మతిరిగేలా చేస్తున్న దేవర కలెక్షన్స్

Follow us