విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి సినిమా.. కర్నాటక సీఎం కీలక నిర్ణయం !!

Updated on: Oct 25, 2022 | 9:41 AM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి సుమారు ఏడాది కావొస్తోంది. గతేడాది అక్టోబర్‌ 29న జిమ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశారు.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి సుమారు ఏడాది కావొస్తోంది. గతేడాది అక్టోబర్‌ 29న జిమ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశారు. అప్పు మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు ఇంకా విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆయన గత సినిమా జేమ్స్‌ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇప్పుడు మరోసారి సిల్వర్‌స్ర్కీన్‌పై పునీత్ కనిపించనున్నారు. అప్పు నటించిన చివరి చిత్రం గంధన గుడి. పునీత్ రాజ్‌ కుమార్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై పునీత్ సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫేమస్ ఇడ్లీ పాకలో టిఫిన్ చేసిన మెగా హీరో.. నెట్టింట వీడియో వైరల్

వేప చెట్టు నుంచి పాలు.. ఆమె మహిమేనట.. తాగితే రోగాలు మాయం ??

వామ్మో !! ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు !!

గోడ కూలుస్తుండగా ఊహించని ఘటన !! అక్కడి సీన్‌ చూసి కళ్లు జిగేల్‌ !!

వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడు ఏం చేశాడో చూడండి !!

 

Published on: Oct 25, 2022 09:41 AM
Loading...
Unable to load recommendations.
Follow Us