టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. జనవరి 24 మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ గత కొన్నిరోజులుగా అక్కడే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాడు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే తానెంతో అభిమానించే పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరారు. అంతేకాదు త్వరలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జానీ మాస్టర్ పోటీ చేసే అవకాశముందని టాక్. నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి ఈ స్టార్ కొరియోగ్రాఫర్ బరిలోకి దిగనున్నాడని ప్రచారం కూడా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: దీపికను ఆగం చేస్తున్న బికినీ షో గోల
Mixup: టెంప్ట్ చేస్తున్న ఫిల్మ పోస్టర్.. నెట్టింట వైరల్