Pawan Kalyan: గుడ్‌ న్యూస్‌.. పవన్‌కు కూడా అందిన ఆహ్వానం

|

Jan 05, 2024 | 9:32 AM

అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.

అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తాజాగా పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్, వీహెచ్‌పీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ పవన్‌ కల్యాణ్‌ను కలిసి పవన్‌కు అయోధ్య రామ మందిర ఆహ్వాన పత్రికను అందజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్‌.. OTTలో అదరగొడుతున్న హాయ్‌ నాన్న

Amala Paul: పెళ్లైన 2 నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్

Prabhas: ఫ్యూచర్‌ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్‌

“అందంగా ఉన్నారు.. వయసు తక్కువే మరి”.. రిపోర్టర్‌ వెగటు ప్రశ్నకు.. మీనా క్రేజీ రిప్లై

Lokesh Kanagaraj: చిక్కుల్లో లోకేష్ కనగరాజ్‌.. పిచ్చోడంటూ కోర్టులో పిటిషన్

Follow us on