ఫిల్మ్ నగర్లో రచ్చ లేపుతున్న.. త్రివిక్రమ్ నెక్ట్స్‌ సినిమా అప్డేట్

Updated on: May 22, 2025 | 4:31 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమా తెరకెక్కించాడు.ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బన్నీ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్‌ ఇప్పుడు ఉన్నట్టుండి మరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ బయటికి వచ్చింది.

అయితే ఈ న్యూస్‌కు కంటిన్యూటీగా ఇప్పుడు ఈసినిమాలో హీరో ఫిక్స్ అయినట్టు లేటెస్ట్ అప్డేట్. ఆ అప్డేటే ఇప్పుడు టాలీవుడ్‌లో రచ్చ లేపుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ ఆప్టేట్.. త్రివిక్రమ్ త్వరలో వెంకటేష్ తో సినిమా చేయనున్నారని టాక్. గతంలో త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తున్నాడని టాక్ గతంలోనూ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా దాదాపు ఓకే అయ్యిందని అంటున్నారు. ఈ చిత్రం ఒక కుటుంబ కథాంశంతో రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణం కానుందని, నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుస హత్యలు.. గగుర్పొడిచే సన్నివేశాలు !! తప్పక చూడాల్సిన సిరీస్ ఇది

Hit 3: అప్పుడే OTTలోకి హిట్ 3.. ఎప్పుడంటే ??

నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్

ఈ స్థాయికి రావడం గొప్పే అంటూ.. ట్రోలర్స్‌కు క్లాస్‌ పీకిన అక్క

విశాల్ కాబోయే భార్యను వేదికపైనే అవమానించిన స్టార్