Sai Dharam Tej: తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!

|

Jul 28, 2024 | 5:05 PM

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గొప్ప మనసును చాటుకున్నారు. అనారోగ్య సమస్యలతో, ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామలకు తేజ్‌ ఆర్థికసాయం చేశారు. అంతేకాదు వీడియో కాల్ ద్వారా ఆమె యోగ క్షేమాలు తెలుసుకున్నారు. నటి ఆరోగ్య పరిస్థితి, ఇబ్బందుల గురించి ఆరా తీసి ధైర్యం చెప్పారు. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గొప్ప మనసును చాటుకున్నారు.

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గొప్ప మనసును చాటుకున్నారు. అనారోగ్య సమస్యలతో, ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామలకు తేజ్‌ ఆర్థికసాయం చేశారు. అంతేకాదు వీడియో కాల్ ద్వారా ఆమె యోగ క్షేమాలు తెలుసుకున్నారు. నటి ఆరోగ్య పరిస్థితి, ఇబ్బందుల గురించి ఆరా తీసి ధైర్యం చెప్పారు. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌కు సాయిధరమ్‌తేజ్‌ 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందులో భాగంగా లక్షను నటి పావలా శ్యామలకు అందజేశారు. ఈ తరువాత తేజుతో వీడియో కాల్ మాట్లాడిన శ్యామల ఎమోసనల్ అయ్యారు. తన అమ్మాయికి ఆపరేషన్‌ అయినప్పుడు సాయిధరమ్‌ తేజే తనకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారన్నారు.

తనే వచ్చి స్వయంగా కలుస్తానన్నాడని శ్యామల గుర్తు చేశారు. కానీ చాలా రోజులైనా తేజు రాకపోవడంతో.. తనను మర్చిపోయారేమో అనుకున్నా అన్నారు శ్యామల. కానీ, తనను గుర్తుపెట్టుకొని ఇప్పుడు సాయం చేయడంతో.. ఎమోషనల్ అయ్యారు. తేజుకు నా ధన్యవాదాలు చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు చిరంజీవి తనకు చేసిన సాయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు శ్యామల. ఇక శ్యామల మాటలకు సాయి ధరమ్ తేజ్ కూడా ఎమోషనల్ అయ్యారు. మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే చాలా కష్టంగా ఉంది. ఏడవకండి… అంటూ శ్యామలను ఓదార్చారు. భవిష్యత్తులో అండగా ఉంటానంటూ.. మాటిచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on