AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

ఇండస్ట్రీలో విషాదం.. యంగ్‌ హీరోయిన్‌

Phani CH
|

Updated on: Mar 25, 2026 | 8:12 PM

Share

రాజస్థానీ నటి, మోడల్ హర్షిల్‌ కాలియా జైపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో అదుపుతప్పిన ఆమె కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. తీవ్ర తల గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 'క్రైమ్ నెక్స్ట్ డోర్' ద్వారా గుర్తింపు పొందిన ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాజస్థానీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి, మోడల్ హర్షిల్‌ కాలియా సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వెళ్తున్న ఆమె కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జైపూర్‌లోని షిప్రా పత్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. తన షూటింగ్ ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, కారు నుంచి ఆమెను బయటకు తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, తలకు తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. హర్షిల్‌ కాలియా కేవలం నటిగానే కాకుండా, గతంలో ఒక న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా కూడా పనిచేశారు. ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోలలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె తండ్రి కూడా జర్నలిస్టుగా పనిచేస్తుండటం గమనార్హం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక వేరే వాహనం ఏదైనా అడ్డువచ్చిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హర్షిల్‌ మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. బంగారం,వెండి ధరలకు రెక్కలు

ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే

ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి

గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు

మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు

Follow Us