Dhanush: ఇద్దరు కొడుకులతో ఆడియో లాంచ్‌కు ధనుష్‌.. నెట్టింట వీడియో హల్ చల్

Updated on: Feb 06, 2023 | 8:32 PM

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ధాత్రి. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో సార్‌ అనే పేరుతో విడుదల చేయనున్నారు.

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ధాత్రి. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో సార్‌ అనే పేరుతో విడుదల చేయనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 4న ఆడియో ఫంక్షన్‌ నిర్వహించారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ కళాశాల ఆవరణలో చిత్ర ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ధనుష్‌ ఓ కొత్త గెటప్‌లో హాజరయ్యారు. అంతేకాదు ఆయన ఇద్దరు కుమారులు కూడా తండ్రితోపాటు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక ముందు ధనుష్‌కు ఇరువైపులా ఆయన కొడుకులు కూర్చోవడంతో ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా ట్రక్కును ఢీకొట్టిన కారు.. పల్టీలు కొట్టిన ట్రక్‌.. వీడియో చూస్తేనే గుండె దడ పుడుతోంది

కొన్ని గంటల్లో పెళ్లి.. ఎయిర్‌‌పోర్ట్‌లో వధువు.. విషయం తెలిసి అంతా షాక్ !!

ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. ‘ది టెర్మినల్‌’ స్టోరీ రిపీట్‌ !!

పర్యాటకులను పరుగులు పెట్టించిన ఏనుగు.. భయంతో వణికిపోయిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే ??

Harish Rao: అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన హరీష్‌ రావు.. రైతు భీమా కోసం రూ. 1589 కోట్లు..

 

Published on: Feb 06, 2023 08:18 PM
Loading...
Unable to load recommendations.
Follow Us