హీరోయిన్ Vs పొలిటిషియన్ ముదురుతున్న వివాదం

Updated on: Feb 26, 2025 | 5:40 PM

జేసీ – మాధవీలత మధ్య వివాదం మరింత ముదురుతోంది. గతంలో మాధవీలత కామెంట్స్‌తో మొదలైన ఈ రచ్చ.. జేసీ రియాక్షన్‌తో వేడెక్కింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం పోలీస్ స్టేషన్ల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

మాధవీలత తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కమలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివాదం ఎక్కడ మొదలైదంటే.. తాడిపత్రిలో డిసెంబర్‌ థర్టీఫస్ట్‌ జేసీ నిర్వహించిన ఈవెంట్‌కి మహిళలు వెళ్లొద్దంటూ మాధవీలత, యామిని పిలుపివ్వడంపై JC భగ్గుమన్నారు. మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు. జేపీ కామెంట్స్‌పై ఘాటుగా విమర్శలు వ్యక్తం కావడంతో ఆయన క్షమాపణలు కోరారు. అయితే అంతటితో ఆ వివాదం ముగుస్తుందని అంతా భావించారు. కానీ జెసి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై మాధవిలత సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఆ రోజు నుంచీ జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు పీక్స్‌కి చేరింది. తాజాగా తాడిపత్రిలో మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాట నిలబెట్టుకున్న మ్యాడ్ టీం! కడుపుబ్బా నవ్విస్తున్న టీజర్

చిన్న పార్టీకే.. లక్షల్లో ఖరీదైన డ్రెస్! కీర్తి సురేష్ భర్తతో మామూలుగా ఉండదు

Mumaith Khan: ముమైత్ ఖాన్.. ఇప్పుడు టార్గెట్ తెలుగు యూతే!

Thandel: గుడ్ న్యూస్ తండేల్ OTT డేట్ ఫిక్స్?

భర్తకు రూ.150 కోట్ల ఆస్తి.. పైగా తను కోట్ల హీరోయిన్! ఇక ఊరుకుంటుందా?