ఉదిత్ను కోర్టుకు ఈడ్చిన మాజీ భార్య! ఆ సింగర్కు కష్టాలే కష్టాలు!
బాలీవుడ్ స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఒక సంగీత కచేరీలో మహిళా అభిమానులను ముద్దు పెట్టుకుని హాట్ టాపిక్ గా మారారు ఉదిత్. కేసుల వరకు తెచ్చుకున్నారు. అయితే ఈయనపై కోర్టు మెట్లెక్కింది మరెవరో కాదు, ఆయన మాజీ భార్య రంజనా ఝా. ఉదిత్ నారాయణ్ తన ప్రాథమిక హక్కులను కాలరాశారని, తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ రంజనా మీడియా ముందుకు వచ్చారు.
ఈ మేరకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరయ్యారు. అయితే ఈ విషయంలో తాను కరెక్ట్ గానే ఉన్నానని, ఎలాంటి రాజీకి సిద్ధంగా లేనని ఉదిత్.. న్యాయమూర్తితో చెప్పారు. తన మాజీ భార్య రంజన తన నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తోందంటూ ఆమెపై ఆరోపణలు గుప్పించారు. ఇక గతంలో ఉదిత్… రంజనాకు నెలకు 15 వేల రూపాయలు ఇచ్చేవారట. 2021లో దానిని 25 వేల రూపాయలకు పెంచారట. ఇది కాకుండా, ఉదిత్ రంజనాకు రూ.1 కోటి విలువైన భూమి, ఇంటిని ఇచ్చారట. 25 లక్షల విలువైన ఆభరణాలను కూడా ఇచ్చారట. అయితే రంజనా దానిని అమ్మేసిందని ఉదిత్ ఆరోపిస్తున్నారు. మరో వైపు ఉదిత్ తనను పట్టించుకోవడం లేదని రంజనా ఆరోపణలు చేస్తున్నారు. తాను ముంబైకి వచ్చిన ప్రతిసారీ బెదిరింపులను ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హ్యాట్సాఫ్! తలకు గాయమైనా.. సినిమా ప్రమోషన్కు డుమ్మా కొట్టేదేలే
మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?
చిరంజీవి, సుకుమార్ పై అంబటి చీప్ కామెంట్స్! ఫ్యాన్స్ ఫైర్
TOP 9 ET News: స్టేడియంలో చిరంజీవి, సుకుమార్.అంబటి చీప్ కామెంట్స్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

