రిపబ్లిక్ ఈవెంట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీని ఇటు సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇండస్ట్రీలోని పెద్దలు రకరకాలుగా స్పందిస్తూ.. వివాదాన్ని సద్దుమనిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ వేదికల పై బహిరంగంగానే.. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే తాజగా అల్లు అరవింద్ మోస్ట ఎలిజిబుల్ ట్రైలర్ ఈవెంట్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి ఓ విజ్ఙప్తి చేశారు.
ఇంతకు ముందు లవ్స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ వేదికగా నాగ్ జగన్ ప్రభుత్వాన్ని చేసిన విజ్ఙప్తి మాదిరిగానే.. అల్లు కూడా జగన్ ప్రభుత్వాన్నికి ఓ విజ్ఙప్తి చేశారు. దాంతో పాటు సినిమా పెద్దలు త్వరలోనే ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ కలవాలని ప్లాన్ చేస్తున్నట్టు రివీల్ చేశారు. అంతే కాదు.. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్ను కోరారాయన. రాజు తలచుకుంటే వరాలకు కొదవా అని సీఎం జగన్ను ఉద్దేశిస్తూ చమత్కరించారు. కరోనా నుంచి ప్రజలను గట్టెక్కించినట్టే.. టాలీవుడ్నూ ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
మరిన్ని చదవండి ఇక్కడ : EV Battery Charger Video: ప్రపంచం లోనే.. ఫస్ట్ టైం.. 3 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. 100 కి.మీ. ప్రయాణించొచ్చు..!(వీడియో)