Diabetes: ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు పది కోట్ల మంది చేస్తున్న పోరాటమిది. పది కోట్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ కుటుంబాల్లో దాదాపు 40 కోట్లమందిని మానసికంగా వేధిస్తోంది ఇది. దేశ జనాభాలో వీరి శాతం ఎంతో చెప్పనా.. 11.4 శాతం. యుద్ధం చేద్దామంటే శత్రువు దొరకడు. కంటికి కనిపించడు. అయినా పోరాటం తప్పదు. పేరుకు షుగరే.. కానీ తేడా వస్తే.. ప్రాణాంతకం.
ఆ సైలెంట్ కిల్లర్ పేరు.. డయాబెటిస్. షుగర్ పేషెంట్ల నెంబర్ గురించి చెప్పుకున్నాం. కానీ డయాబెటీస్ బారిన పడడానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది. అదే ప్రీ డయాబెటీస్. మన దేశంలో ఈ స్టేజ్ లో ఉన్నవారు ఎందరో తెలుసా? 13 కోట్ల 60 లక్షలు. మన దేశ జనాభాలో వీరి శాతం ఎంతో చెప్పనా? 15.3 శాతం. మన దేశంలో మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే.. ఈ నెంబర్ చాలా ఎక్కువ. అంటే దేశంలో షుగర్ పేషెంట్లు, షుగర్ వచ్చే అవకాశం ఉన్న పేషెంట్ల నెంబర్ ను కలిపితే.. దాదాపు 24 కోట్లు. ఈ అంకె చూస్తే మతిపోతుంది. అంటే ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అర్థమవుతుంది. దేశానికి సవాల్ విసురుతోంది. అలెర్ట్ అవ్వమని హెచ్చరిస్తోంది. అసలీ షుగర్ వ్యాధి.. స్వీట్స్ తింటే వస్తుందా? టెన్షన్ పెరిగితే వస్తుందా? ఎక్సర్ సైజ్ లేకపోతే వస్తుందా? అసలెందుకు వస్తుంది? నిజానికి చాలామందికి దీనిపై ఇప్పటికీ అవగాహన లేదు. డాక్టర్లు చెబితే వినే పరిస్థితి లేదు. పోనీ టెస్టు చేయించుకుంటారా అంటే అదీ లేదు. నిజం చెప్పాలంటే.. చాలామందికి ఆర్థికంగా ఆ అవకాశమూ లేదు. మరి దీనికి పరిష్కారమేంటి? అందుబాటులో ఉన్న చికిత్సలేంటి? మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: రైల్వే స్టేషన్లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా !! చావు బతుకుల్లో ఉన్నోడిని తన...
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

