Kurnool District: కొండల రాయుడికి తేళ్ల నైవేద్యం.. కర్నూల్ జిల్లాలో వింత ఆచారం..
Kurnool District: కర్నూల్ జిల్లా, పరిసర ప్రాంత ప్రజలు తేళ్లను శరీర భాగాలపై పాకించుకుంటూ, కుట్టించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం మూడవ సోమవారంలో కర్నూల్ జిల్లాలోని కోడుమూరు కొండపై ఉన్న కొండల రాయుడికి తేళ్లతో నైవేద్యం పెడుతుంటారు. ఇలా తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో వారు తేళ్లను చేతులు, తల, ముఖం, చివరికి నాలుక పైన కూడా పెట్టుకుంటారు, అయితే ఈ ఒక్క రోజు వారికి ఏమీ కాదంట. ఒకవేళ తేళ్లు..
కర్నూల్ జిల్లా, సెప్టెంబర్: ఎంతటి ధైర్యవంతులైనా తేలు అంటే జంకుతారు. అయితే కర్నూల్ జిల్లా, పరిసర ప్రాంత ప్రజలు మాత్రం తేలును శరీర భాగాలపై పాకించుకుంటూ, కుట్టించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం మూడవ సోమవారంలో కర్నూల్ జిల్లాలోని కోడుమూరు కొండపై ఉన్న కొండల రాయుడికి తేళ్లతో నైవేద్యం పెడుతుంటారు. ఇలా తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో వారు తేళ్లను చేతులు, తల, ముఖం, చివరికి నాలుక పైన కూడా పెట్టుకుంటారు, అయితే ఈ ఒక్క రోజు వారికి ఏమీ కాదంట. ఒకవేళ తేళ్లు కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు నొప్పి మటుమాయం అవుతుందని భక్తులు చెబుతున్నారు. అలాగే కొండల రాయుడికి పూజలు చేసే శ్రావణ సంలో మూడవ సోమవారం రోజు గానీ, ఆ తర్వాత లేదా ముందు రోజు గానీ వర్షాలు కురుస్తుంటాయిన భక్తులు విశేషంగా చెబుతున్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

