మహానంది ఆలయానికి రుద్రాక్ష మండపం
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహానంది ప్రముఖమైనది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో కొలువైన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయానికి భక్తుల నుంచి కానుకలు ఆభరణాలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన SBI రిటైర్డ్ మేనేజర్ మారం వెంకటసుబ్బయ్య దంపతులు 35 కేజీల వెండితో తయారు చేయించిన రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి విరాళంగా అందించారు.
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహానంది ప్రముఖమైనది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో కొలువైన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయానికి భక్తుల నుంచి కానుకలు ఆభరణాలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన SBI రిటైర్డ్ మేనేజర్ మారం వెంకటసుబ్బయ్య దంపతులు 35 కేజీల వెండితో తయారు చేయించిన రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి విరాళంగా అందించారు. రుద్రాక్ష మండపం గర్భాలయంలో స్వామి వారికి పై భాగాన అలంకరిస్తారు. వెండితో తయారు చేసిన రుద్రాక్ష మండపాన్ని ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డికి దాతలు అందజేశారు. కార్తీక మూడవ సోమవారం సందర్భంగా ఆలయంలో సంప్రోక్షణ అనంతరం దాతల కుటుంబీకులు శ్రీ మహానంధీశ్వర స్వామికి ప్రత్యేకపూజలు నిర్వహించి రుద్రాక్ష మండపాన్ని అందజేశారు. దాతలు వెంకటసుబ్బయ్యకు కుటుంబీకులకు ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరింత మంది భక్తులు విరాళాలు అందజేశి ఆలయ అభివృద్ధి లో భాగస్వాములై స్వామి,అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బురద ఉత్సవం.. ఆరోజు ఊళ్లోవాళ్లంతా బురద పూసుకోవాల్సిందే
బీచ్ లో ఈత కొడుతున్న మహిళ కాలును తినేసిన షార్క్
తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే !!
పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..
ఇదేం కొట్టుడురా మామ.. వింటుంటే ఒళ్లు ఊగుతాంది..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

