AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే?

Viral: తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే?

Ram Naramaneni
|

Updated on: Sep 11, 2025 | 9:20 AM

Share

రద్దీ ప్రదేశంలో ఓ ఖరీదైన ల్యాప్‌టాప్‌ను అరగంట పాటు వదిలేస్తే ఏమవుతుంది? కచ్చితంగా మాయమవుతుంది. కానీ చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడి ప్రజా భద్రత, ప్రజల నమ్మకాన్ని పరీక్షించేందుకు అతను చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు వైరల్‌గా మారింది.

చైనాలోని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ టిన్‌చో, తన ల్యాప్‌టాప్‌ను రద్దీ ప్రదేశంలో 30 నిమిషాల పాటు వదిలిపెట్టి వెళ్ళాడు. ఇది ప్రజల నమ్మకాన్ని, ప్రజాభద్రతను పరీక్షించే ప్రయోగంగా అతను భావించాడు. ఆశ్చర్యకరంగా, ల్యాప్‌టాప్‌ను ఎవరూ దొంగలించలేదు. ఈ ఘటనను వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివిధ దేశాల ప్రజలు తమ దేశాల్లోని పరిస్థితులను పోల్చుతూ కామెంట్లు చేశారు. కొందరు తమ దేశాల్లో ఇలాంటిది జరగడం అసాధ్యమని, మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయోగం, ప్రపంచవ్యాప్తంగా ప్రజాభద్రత, నమ్మకంపై కొత్త చర్చను రేకెత్తించింది.

Follow Us