CCTV: మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్

|

Oct 13, 2024 | 4:24 PM

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇంజనీర్ అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 10 న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

CCTV: మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్
Car Collides With Turning Car
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూల మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అభయ్ అలియాస్ లక్కీ త్రిపాఠి హైవేపై అతి వేగంతో కారులో వెళ్తుండగా.. మలుపు తిరుగుతున్న ఒక ఇంజనీర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇంజనీర్ అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 10 న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూడండి..

ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌లోని జైపూర్ లో మరో ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇందులో ఓ కారు మంటల్లో కాలుతూ రోడ్డుపై పరుగులు పెట్టింది. అది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్టుగా తెలిసింది. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..