భారత్ లో ఇక ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు భారత్ లో 65 ఏళ్ల వయసు వరకు మాత్రమే హెల్త్ పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడా నిబంధనను ఎత్తివేశారు. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు సైతం ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏ ప్రకటన చేసింది. ఇది 2024 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందని ఐఆర్ డీఏ వెల్లడించింది. అన్ని వయసుల వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ఉద్దేశం అని స్పష్టం చేసింది. తమ తాజా నిర్ణయం ద్వారా… ఇకపై బీమా కంపెనీలు వృద్ధులు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఇలా వివిధ వర్గాల వారికి ప్రత్యేకంగా బీమా పాలసీలు రూపొందించే అవకాశం ఉంటుందని ఐఆర్ డీఏఐ వివరించింది. అంతేకాదు, బీమా విధానంలో ఇటీవల తెచ్చిన మార్పులతో ఇక మీదట బీమా కంపెనీలు క్యాన్సర్, గుండె, మూత్ర పిండాల వైఫల్యం, ఎయిడ్స్ వంటి ప్రమాదకర జబ్బులతో బాధపడేవారికి బీమా పాలసీలు నిరాకరించడం కుదరదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై గాయాలతో పునుగుపిల్లి.. టీవీ9 సమాచారంతో
TOP 9 ET News: నలుగురు హీరోల దెబ్బకు బాలీవుడ్లో రూ.500 కోట్లు ఖల్లాస్
Puspa 02: పుష్ప రాజ్గా ఇరగదీసిన బుడ్డోడు..
దురదృష్టవంతురాలని సినిమాల నుంచి తీసేశారు
War 02: దిమ్మతిరగే న్యూస్.. వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్..